ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ నెల నుంచే ఉమ్మడి పౌర స్మృతి అమలు కానున్నది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి తెలిపారు. యూపీలోని బరేలీలో జరినగి ఓ కార్యక్రమంలో పాల్గొంటూ 29వ ఉత్తరయాని మేళాను సీఎం ధామి ప్రారంభించారు.
2024, ఫిబ్రవరి ఏడవ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉమ్మడి పౌర స్మృతి బిల్లును పాస్ చేసింది. ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం వెంటనే దక్కింది. ఆ తర్వాత మార్చి 12, 2024లో నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి పౌర స్మృతి 2024 చట్టాన్ని రూపొందించారు. జనవరి 2025 నుంచి ఆ చట్టాన్ని పూర్తిగా అమలు చేయనున్నట్లు చెప్పారు.
యూసీసీ అమలు కోసం ప్రత్యేక పోర్టల్, మొబైల్ యాప్ డెవలప్ చేశారు. మహిళలు, పిల్లల సాధికారతే లక్ష్యంగా యూసీసీ అమలు ఉంటుందని సీఎం ధామి గతంలో తెలిపారు. ఈ సందర్భంగా యుసిసి ప్రాధాన్యత గురించి నొక్కి చెబుతూ బాబా సాహబ్ భీమ్ రావ్ అంబేద్కర్ ఆర్టికల్ 44 ను ప్రవేశపెట్టినప్పుడు, “రెండు రాష్ట్రాలు, దేశాలలో ఏకరీతి సివిల్ కోడ్ అమలులో ఉండేలా నిబంధన పెట్టారు” అని ధామి చెప్పారు.