మహా కుంభమేళాలో ప్రఖ్యాత కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు

VSK Telangana    10-Jan-2025
Total Views |
 
melas
 
ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమంలో మహా కుంభమేళా అగ్రగణ్యం. సంస్కృతులు, సంప్రదాయాలు, కళాత్మక వ్యక్తీకరణల సంగమం. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఓసారి నిర్వహించే కుంభమేళా కార్యక్రమం ప్రపంచ వ్యాప్తమైంది. భారత దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి ఇదో అద్భుతమైన వేదిక.వివిధ అంశాలలో, సాంస్కృతిక కళాకారుల ప్రదర్శన కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది, వారు తమ సంగీతం, నృత్యం మరియు నాటక ప్రదర్శనలతో లక్షల మంది ప్రజలను ఆకర్షిస్తారు. మరియు విశ్వాసం, భక్తి మరియు చరిత్ర యొక్క కథలను వివరిస్తారు.

melas23 
మహా కుంభమేళాలో ప్రదర్శనలు ఇవ్వడానికి యూపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వివిధ రకాల కళాకారులను సాదరంగా ఆహ్వానించింది. ఈ కళాకారుల ప్రదర్శన జనవరి 16 నుంచి ప్రారంభం అవుతాయి. 24 ఫిబ్రవరి వరకూ సాగుతాయి. మొదటి రోజు శంకర్ మహాదేవన్ కార్యక్రమంతో కళాకారుల ప్రదర్శనలు ప్రారంభం అవుతాయి. చివరి రోజు మోహిత్ చౌహాన్ ప్రదర్శన ఇవ్వనున్నారు.కైలాష్ ఖేర్, షాన్ ముఖర్జీ, హరిహరన్, కవితా కృష్ణమూర్తి, కవితా సేథ్, రిషబ్ రిఖిరామ్ శర్మ, శోవన నారాయణ్, డా. ఎల్ సుబ్రమణ్యం, బిక్రమ్ ఘోష్, మాలినీ అవస్తి మరియు అనేక ఇతర ప్రఖ్యాత కళాకారులు కూడా ప్రయాగ్‌రాజ్‌లో ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

melas2 
మహా కుంభమేళాలో సాంస్కృతిక కళాకారులు, ఆధ్యాత్మికవేత్తల కళాత్మక వ్యక్తీకరణలు సామరస్య సమ్మేళనానికి ప్రతీక.ప్రాంతీయ, భాష అడ్డంకులను కూలదోసి, ఈ కళాకారులు లక్షల మందిని తమ కళాత్మక విద్యతో, భక్తితో పారవశ్యంలోకి తీసుకెళ్లనున్నారు.