
ఆస్ట్రేలియా నగరం సిడ్నీలోని బోండి బీచ్లో 16 మంది ప్రాణాలు తీసిన దాడికి సంబంధించి కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాది సాజిద్ అక్రమ్కు హైదరాబాద్తో సంబంధాలు ఉన్నట్లుగా ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. అతని దగ్గర హైదరాబాద్ పాస్పోర్టు లభ్యమైంది. ఈ నేపథ్యంలో సాజిద్ అక్రమ్ గురించి కీలక విషయాలను తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. అక్రమ్ హైదరాబాద్లోనే బీకామ్ పూర్తి చేశాడని తెలిపారు. స్టూడెంట్ వీసాపై 1998 నవంబర్లో ఆస్ట్రేలియాకు వెళ్లాడన్నారు. అక్కడే యూరప్లోని ఇటలీకి చెందిన వెనీరా గ్రాసోను వివాహం చేసుకున్నాడని వారికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారని చెప్పారు. ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత 2001లో తన వీసాను పార్టనర్ వీసాగా మార్చుకున్నాడు. 2002లో రెసిడెంట్ వీసాను పొందినట్లు తెలిసింది. ఇప్పటికీ సాజిద్ భారత పాస్పోర్టు కలిగి ఉన్నాడని, అతని పిల్లలకు మాత్రం ఆస్ట్రేలియా పౌరసత్వం ఉందని వెల్లడించారు. గడిచిన 25 ఏళ్లలో సాజిద్ ఆరుసార్లు మాత్రమే ఇండియాకు వచ్చాడని డీజీపీ శివధర్ రెడ్డి వివరాలిచ్చారు. 2017లో తండ్రి చనిపోయిన సమయంలో ఒకసారి హైదరాబాద్ వచ్చి వెళ్లాడని పేర్కొన్నారు. 2022లో హైదరాబాద్లోని టోలీచౌకీలో ఉన్న ఆస్తులను అమ్ముకొని వెళ్లినట్లు సమాచారం ఇచ్చారు. తెలంగాణలో సాజిద్పై ఎలాంటి క్రైమ్ రికార్డ్స్ లేవని వెల్లడించారు.
ఆ దేశ ఇమ్మిగ్రేషన్ బ్యూరో ప్రకారం, సాజిద్ అక్రమ్ (50) భారతీయ పాస్పోర్ట్ ఉపయోగించి ఫిలిప్పీన్స్లోకి ప్రవేశించగా, అతని కుమారుడు నవీద్ అక్రమ్ (24) ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్పై ప్రయాణించాడు. ఇద్దరూ నవంబర్ 1న సిడ్నీ నుండి వచ్చి నవంబర్ 28న వెళ్లిపోయారు. ఇమ్మిగ్రేషన్ ప్రతినిధి డానా సాండోవాల్ మాట్లాడుతూ, ఈ జంట దక్షిణ నగరమైన దావోను తమ చివరి గమ్యస్థానంగా ప్రకటించి సిడ్నీకి తిరుగు ప్రయాణ విమానాలను బుక్ చేసుకున్నారని చెప్పారు. “సాజిద్ అక్రమ్ (50) భారతీయ పాస్పోర్ట్ ఉపయోగించి ప్రయాణించగా, అతని కుమారుడు నవీద్ (24) ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ను ఉపయోగించారు” అని సాండోవాల్ చెప్పారు. ఇస్లామిక్ స్టేట్-లింక్డ్ నెట్వర్క్లు ఫిలిప్పీన్స్లో పనిచేస్తున్నట్లు తెలిసినవే. దేశంలోని దక్షిణ ప్రాంతంలో కొంత ప్రభావాన్ని చూపాయి. ఇటీవలి సంవత్సరాలలో వాటిని దక్షిణ మిండానావో ద్వీపంలో పనిచేస్తున్న బలహీనమైన విభాగాలుగా భావిస్తున్నారు.
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ మంగళవారం మాట్లాడుతూ, ఇద్దరు అనుమానితులు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) భావజాలం ద్వారా ప్రభావితం అయిన్నట్లు స్పష్టం చేశారు. “ఇది ఇస్లామిక్ స్టేట్ భావజాలం ద్వారా ప్రేరేపించినట్లు కనిపిస్తుంది” అని అల్బనీస్ తెలిపారు. “ఒక దశాబ్దానికి పైగా ఉన్న భావజాలం ఈ ద్వేష భావజాలానికి దారితీసింది. ఈ సందర్భంలో, సామూహిక హత్యకు సంసిద్ధత. తొలి సూచనలు ఇస్లామిక్ స్టేట్ నుండి ప్రేరణ పొందిన ఉగ్రవాద దాడిని సూచిస్తున్నాయి, దీనిని తండ్రి, కొడుకు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి” అని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ కమిషనర్ క్రిస్సీ బారెట్ ఒక వార్తా సమావేశంలో చెప్పారు.
సిడ్నీ శివారులోని రైలు స్టేషన్ల బయట యువ షూటర్ ఇస్లాంను ప్రచారం చేస్తున్న వీడియోలు వెలువడ్డాయి. అతను హింస మార్గంలోకి ఎలా వెళ్ళాడనేది అధికారులు సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. “ఇవి ఒక మతంతో కాదు, ఒక ఉగ్రవాద సంస్థతో పొత్తు పెట్టుకున్న వారి చర్యలు” అని స్పష్టం చేశారు.