బాల రాముడిపై విజయవంతమైన యానిమేషన్ సిరీస్ “శ్రీమన్ రామ్” సృష్టికర్త వందేళ్ల ఆరెస్సెస్ శతాబ్దపు సేవకు వినమ్ర నివాళిగా కొత్త యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ “సేవక్”ను ప్రకటించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా, జాతీయ అవార్డు విజేత, ప్రముఖ రచయిత-దర్శకుడు సత్యకాశీ భార్గవ తన తదుపరి భారీ ప్రాజెక్టు – “సేవక్” అనే యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ను ప్రకటించారు. హైదరాబాదులో ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన ఈ ప్రకటన, వందేళ్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ద కాల సేవకు కృతజ్ఞతగా నిర్మితమౌతోందని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాల ప్రేక్షకుల కోసం రూపొందించబడుతున్న “సేవక్”, ఓ ఉత్సాహభరితమైన 9 ఏళ్ల బాల కథానాయకుడు, ఒక ఆవు దూడ చుట్టూ తిరిగే కథ అని, ఈ చిత్రం అద్భుతమైన యానిమేషన్, హృదయాన్ని తాకే సంగీతం, రొమాంచక కథనంతో బాలలను దేశసేవ పట్ల గౌరవాన్ని కలిగించేలా తీర్చిదిద్దబడుతోందని చిత్ర రూపకర్తలు తెలిపారు.
“ఇది సాధారణ యానిమేషన్ ప్రాజెక్ట్ కాదు – ఇది ఓ సాంస్కృతిక ఉద్యమం. ఆరెస్సెస్ 100 ఏళ్లుగా చూపిన సేవా స్పూర్తికి ‘సేవక్’ నా వినయపూర్వక, సృజనాత్మక నివాళి రాబోయే తరాలకు ఆ సేవా స్ఫూర్తిని వారికి అర్ధమయ్యే రీతిలో , ఏనిమేషన్ మాధ్యమంలో అందించే ప్రయత్నమిది . ఈరోజు హనుమాన్ జయంతి, ప్రపంచంలోనే మొట్టమొదటి నిస్వార్ధ సేవకుడు హనుమంతుడు . రాముడు మన దేశపు ఆత్మ , అయన సేవలో పునీతుడైన హనుమంతుడి స్ఫూర్తిగా ” అని రచయిత, దర్శకుడు సత్యకాశీ భార్గవ ప్రత్యేకంగా చెప్పారు.
ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలో నిర్మాణ దశలోకి ప్రవేశించనుంది. మొదట హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలయ్యే ఈ చిత్రం, తర్వాత భారత్లోని వివిధ భాషల్లోకి విస్తరించనుంది. ట్రైలర్ విడుదల సమీపంలోనే ఉండగా, పూర్తి చిత్రం విజయదశమికి విడుదల చేయాలని లక్ష్యంగా ఉంచారు – ఇది స్వయంసేవా భావానికి సరిగ్గా సరిపోయే సందర్భంగా... అన్నారు.
“సేవక్” చిత్రం భారతీయ సాంస్కృతిక వారసత్వం, చారిత్రక ప్రదేశాలు, త్యాగ గాధల పర్యటనగా అలరిస్తుందని.... సంగీతం, నృత్యం, వినోదం, అడ్వెంచర్—అన్నీ కలిపి, బాలలను ఆకట్టుకునేలా రూపొందించబడుతుందని... ఈ కథను మరింత ప్రామాణికంగా, హృదయానికి హత్తుకునేలా రూపకల్పన చేసేందుకు, భార్గవ తన బృందంతో కలిసి సీనియర్ ఆరెస్సెస్ నాయకులను సంప్రదించనున్నట్లు తెలిపారు.
“శ్రీమన్ రామ” అనే సూపర్ హిట్ యానిమేషన్ సిరీస్ తర్వాత వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ – డీడీ నేషనల్, ప్రసార్ భారతీ వేవ్స్ OTTలో ప్రసారమైన ఈ సిరీస్ 100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలు దాటి, కేవలం హిందీలోనే 45 లక్షల మందికి చేరింది. ఇటీవలే శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 3వ ఎడిషన్లో ‘బెస్ట్ యానిమేషన్ షో’ అవార్డును గెలుచుకుంది.
“యానిమేషన్ అనే మాధ్యమం ద్వారా భారతీయ సంస్కారాలను పిల్లల మనస్సుల్లో బలంగా నాటవచ్చు. ‘సేవక్’తో, మేము కేవలం వినోదం ఇవ్వడమే కాదు – ఉద్దేశ్యభరితమైన జీవితానికి, దేశసేవ పట్ల వారి దృష్టిని మలచాలనుకుంటున్నాం,” అని సత్యకాశీ భార్గవ తెలిపారు.
భారతీయ యానిమేషన్ సామాజిక పరంగా ముఖ్యమైన, సాంస్కృతికంగా విలువగల కంటెంట్తో ముందుకు సాగుతున్న ఈ సమయంలో, “సేవక్” ఓ మైలురాయిగా నిలవనుంది – భారతీయ పరంపరలు, ధర్మబద్ధమైన జీవనమూల్యాలు, భారతీయ త్యాగధనులను ను శ్రద్ధతో ఆవిష్కరించే ఓ విశిష్ట సినిమా అవుతుంది.