దాయాది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ భారత్ పై, హిందూ మతంపై విద్వేషాన్ని వెళ్లగక్కారు. దీనికి సంబంధించిన వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలోకి వచ్చేశాయి కూడా. ఇస్లామాబాద్ లో జరిగిన ఓవర్సీర్ పాకిస్తానీస్ కాన్ఫరెన్స్ లో ఆసిమ్ మునీర్ హిందూ ధర్మంపై, భారత్ పై విషం గక్కారు.
‘‘ఉద్దేశాలలో అయినా, మతపరంగా అయినా.. మనం అన్న విధాలుగా హిందువులకు భిన్నంగానే వున్నాం. మీరు మీ పిల్లలకు చిన్నప్పటి నుంచే పాక్ కథలు చెబుతూ వుండాలి. దీంతో దేశాన్ని ఎప్పటికీ మరిచిపోరు. దేశంతో పెనవేసుకుపోతారు. పాకిస్తాన్, భారత్ రెండూ వేర్వేరు దేశాలు. సంస్కృతిలో అయినా, ఆలోచనల్లో అయినా, మతపరమైన ధారలో కూడా ఎక్కడా సారూపత్యలనేవే లేవు.మన మతం వేరు. మన ఆచారాలు వేరు. మన సంస్కృతీ వేరు. ఆశయాలూ భిన్నంగానే వుంటాయి. ఇక్కడేమో రెండు దేశాల సిద్ధాంతం. ఒకే దేశం అన్న సిద్ధాంతం కాదు. ఈ దేశం కోసం ఎందరో త్యాగాలు చేశారు. దేశాన్ని ఎలా రక్షించుకోవాలో మనకు తెలుసు. ఈ విషయాలన్నీ పిల్లలకు చెప్పాలి. ఈ నేపథ్యాన్ని అస్సలు మరిచిపోవద్దు.’’ అని వ్యాఖ్యానించారు.
అలాగే పాక్ దేశం ఏర్పడిన పునాదులను కూడా గుర్తు చేశారు. పాక్ ఒక్కటే ఇస్లామిక్ నమ్మకం అన్న పునాదులపై ఏర్పడిన దేశమని తెలిపారు. అలాగే పాక్ దేశం ఏర్పడిన పునాదులను కూడా గుర్తు చేశారు. పాక్ ఒక్కటే ఇస్లామిక్ నమ్మకం అన్న పునాదులపై ఏర్పడిన దేశమని తెలిపారు. మొదట రియాసత్ ఎ తోయిబా అని, ఆ తర్వాత ఇస్లామిక్ పునాదులపై పాక్ ఏర్పడిందన్నారు.
ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్తాన్కు పెట్టుబడులు రాకపోవచ్చని చాలామంది భయపడుతున్నారని జనరల్ మునీర్ అన్నారు. 13 లక్షల భారత సైనికులే పాకిస్థాన్ను భయపెట్టలేకపోయారని.. అలాంటిది ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును హరించగలరని మీరు భావిస్తున్నారా..? అని కీలక వ్యాఖ్యలు చేశారు. బలూచిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమాలపై సాయుధ దళాలు కఠినంగా వ్యవహరిస్తాయని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. కాశ్మీరీ ప్రజల స్వీయ నిర్ణయ హక్కు కోసం పాకిస్థాన్ తన మద్దతును కొనసాగిస్తుందని, ఐక్యరాష్ట్ర సమితి తీర్మానాలకు అనుగుణంగా వారి పోరాటానికి రాజకీయ, దౌత్యపరమైన సహకారం అందిస్తుందని ఆయన అన్నారు.