ప్రార్థనల పేరిట వ్యవస్థీకృత నేరాలు... బలైపోతున్న హిందువులు

VSK Telangana    30-Apr-2025
Total Views |

Prayers
 
ఏసు ప్రభువును నమ్ముకుంటే చాలు రోగాలు తగ్గిపోతాయని, ప్రేయర్ ఆయిల్ అని మాయమాటలు చెబుతూ స్వస్థత కూడికలు, చర్చిలో ప్రత్యేక ప్రార్థనల పేరిట మతప్రచారం చేస్తూ ఎందరో అమాయకులు, ప్రత్యేకించి హిందువుల ప్రాణాలను పాస్టర్లు బలిగొంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి సంఘటనలు ఎన్నోజరగ్గా, ఇటీవల ఇవి మరింత ఎక్కువయ్యాయి. ఈ స్వస్థత కూడికల్లోనే సమస్త రోగాలు తగ్గడం నిజమైతే క్రైస్తవంలో మిషనరీ ఆస్పత్రులు ఎందుకో... క్రైస్తవ దేశాలైన అమెరికా, బ్రిటన్ తదితర పాశ్చాత్య దేశాల్లో లక్షలు, కోట్ల డాలర్ల ఖర్చుతో వైద్య పరిశోధనలు ఎందుకో వారే చెప్పాలి. యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన నిన్నటి కరోనా, అంతకుముందు ఎయిడ్స్, ఎబోలా, కలరా వంటి అనేక ఉపద్రవాల వేళ ఇవేమీ ఎందుకు పనికిరాలేదన్న ప్రశ్నకు వారివద్ద జవాబు లేదు. చివరికి క్రైస్తవ మతాధిపతులైన పోప్‌లు సైతం అనారోగ్యానిక గురైనప్పుడు వారికి ఇవేమీ పని చెయ్యలేదా? అంటూ సోషల్ మీడియాలో కోకొల్లలుగా మీమ్స్ వచ్చి పడుతున్నాయి. అసలు ఇదంతా ఒక వ్యవస్థీకృత నేరం (organised crime)గా జరుగుతున్నట్టు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ కథనంలో తెలిపిన ఘటనలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమని భావిస్తే పొరపాటు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఉన్న చర్చిలలో రోగుల కోసం ప్రత్యేక ప్రార్థనలు, బహిరంగ ప్రాంతాలలో స్వస్థత కూటములు, ప్రేయర్ ఆయిల్స్ పేరిట మాయాజాలం జరుగుతూనే ఉంది. దక్షిణాదిలో కేరళ, తమిళనాడుల్లో పోటీ పడి మరీ కూటములు పెట్టి జనాన్ని, మరీ ముఖ్యంగా హిందువులను బుట్టలో వేసుకునే కార్యకలాపాలు విస్తారంగా నడుస్తున్నాయి. కేవలం ఒంటికి వచ్చే అనారోగ్యమే కాకుండా మానసిక సమస్యలను కూడా అప్పటికప్పుడు సరిచేస్తున్నట్టు ఈ కూటములలో జరిగే డ్రామా వీడియోలు ఇంటర్నెట్‌లో కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇందుకు సంబంధించి జరిగి రిహార్సిల్స్ వీడియోలు సైతం సర్క్యులేట్ అయ్యాయి. క్రైస్తవం ఎంతో అభివృద్ధి చెందిన మతమని... విజ్ఞానమంతా క్రైస్తవ దేశాల్లోనే పుట్టి ప్రపంచానికి అందిందని చెప్పుకునే మతంలో పైన చెప్పిన సంఘటనల జరగటం చూస్తుంటే ఇవన్నీ కుట్రపూరితంగా, ప్రణాళిక ప్రకారం వ్యవస్థీకృత నేరాలుగా జరుగుతున్నట్టు విశ్వసించాల్సి ఉంటుందని ఇవన్నీ చూస్తున్నవారందరూ బలంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కింద తెలిపిన కొన్ని సంఘటనల్ని గమనిద్దాం..
 

Vizag Church 
 
తాజాగా విశాఖపట్టణంలోని జ్ఞానాపురం చర్చిలో జరిగిన ఘటన హృదయాన్ని కలచివేస్తుంది. విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన పదేళ్ల పూర్ణచంద్రిక గత కొంతకాలంగా వింతగా ప్రవర్తిస్తోంది. తల్లిదండ్రులు వేర్వేరుగా ఉండడంతో తల్లి, అమ్మమ్మ, చంద్రిక ఒకే చోట ఉంటున్నారు. చంద్రికకు దెయ్యం పట్టిందని అనుకున్నారు వీరు. ఎవరు సలహా ఇచ్చారో గానీ.. చంద్రికను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన తల్లి, అమ్మమ్మ.. చర్చిలో ప్రార్థనలు చేస్తే నయమవుతుందని భావించారు. విశాఖలోని కాన్వెంట్ జంక్షన్‌లో ఉన్న చర్చ్‌కు చంద్రికను తీసుకొచ్చారు. అక్కడ ఫాదర్ ప్రార్థన చేశారు. ఆ తర్వాత కూడా బాలికతో పాటు వారు అక్కడే ఉన్నారు. బాలిక వింత ప్రవర్తన చూసి స్థానికులు ఏమైందని ప్రశ్నించారు. ఆరోగ్యం బాగోలేదని తల్లి, అమ్మమ్మ వారికి బదులిచ్చారు. సాయంత్రం వేళ మరికొందరు ప్రార్థనల కోసం చర్చికి వచ్చారు. ఆ సమయంలో బాలిక ముఖానికి వస్త్రాలు చుట్టి బోర్లా పడుకుని ఉండడాన్ని గమనించి ప్రశ్నించారు. బాలికను పలకరించేందుకు ప్రయత్నించిన వారితో చంద్రిక తల్లి, అమ్మమ్మ వాగ్వాదానికి దిగారు. చివరికి ఈ విషయం తెలిసి రంగంలోకి దిగారు పోలీసులు. వారు చర్చి వద్దకు వెళ్లే సమయానికి బాలిక చలనం లేకుండా ఉంది. 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న సిబ్బంది బాలికను పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో చివరికి చంద్రిక తల్లి, అమ్మమ్మ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రార్థన చేసిన చర్చి ఫాదర్ సైతం బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పలేదు.

Pastor Praveen Kalvary 
 
తెలంగాణలో జరిగిన మరో ప్రముఖ ఘటనను గమనిస్తే... నయం కాని జబ్బులకు సైతం కేవలం ప్రార్థనలతోనే చికిత్స చేసి.. ప్రాణాలు పోతున్న వారిని కాపాడుతున్నట్లు ప్రచారం చేస్తున్న తెలంగాణలోని బెల్లంపల్లి కల్వరీ మినిస్ట్రీస్ పై కంప్లైంట్ నమోదైంది. వైద్య విజ్ఞాన శాస్త్రానికి కూడా అంతుచిక్కని విధంగా.. "మిరాకిల్ హీలింగ్" పేరుతో ఓ చిన్నారిని కాపాడామని చెప్పుకుంటున్న ఈ క్రైస్తవ సంస్థపై "లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్" (LRPF) ఫిర్యాదు చేసింది. కల్వరీ మినిస్ట్రీస్‌కి చెందిన పాస్టర్ ఆర్.ప్రవీణ్ కుమార్, ఆయన భార్య షారోన్‌లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) తో పాటు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. కిడ్నీ దెబ్బతిని మంచం పట్టి నడవలేని స్థితిలో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారిని మిరాకిల్ హీలింగ్ కార్యక్రమంలో బలవంతంగా నడిపించారు. అంతకుముందు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న గిరిశెట్టి రాజేశ్ అనే 21 ఏళ్ల యువకుడి బాధను ప్రార్థన ద్వారా తగ్గిస్తామని చెప్పి వైద్యం అందించకుండా చేశారు. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. దీని మీదా కల్వరీ మినిస్ట్రీపై కేసు కొనసాగుతోంది. ఈ కల్వరీ మినిస్ట్రీపై గతంలో 34 IPC సెక్షన్‌లు 304-II మరియు 420 కింద మే 25, 2019 నాటి FIR (నం: 46/2019) నమోదయ్యాయి.
 

Bhavya Sri Church 
 
ఇలాంటిదే మరో ఘటన బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న భవ్యశ్రీ అనే ఎనిమిదేళ్ళ బాలికను ప్రార్థనల పేరుతో బలిగొన్న సంఘటన ఏపీలోని పొట్టి శ్రీరాములు జిల్లా చేజర్ల మండలం ఆదురుపల్లి చర్చిలో చోటుచేసుకుంది. జిల్లాలోని కలువాయి మండలం బాలాజీరావుపేటకు చెందిన పామర్తి లక్ష్మయ్య, లక్ష్మి దంపతుల కుమార్తె భవ్యశ్రీ అనారోగ్యానికి గురికావడంతో నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్‌ తీసి, బ్రెయిన్‌ ట్యూమర్ ఉందని గుర్తించి చెన్నై తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కుగానీ, చెన్నైగానీ తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆదూరుపల్లిలోని చర్చిలో ప్రార్థనలు చేస్తే జబ్బు నయమవుతుందని కొందరు చెప్పారు. భవ్యశ్రీతోపాటు చర్చికి చేరుకుని 40 రోజులుగా అక్కడే ఉంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ వచ్చారు. మరోవైపు బిడ్డ పరిస్థితి క్షీణిస్తున్నా దేవుడినే నమ్ముకున్నారు. చివరికి.. చర్చి పాస్టర్ కూడా వారిని వారించలేదు. చివరికి బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయింది.
 
ఏపీలోనే జరిగిన మరో ఘటనలో పెనుమాల దేవదాసు(19), తలకాయల గౌతమ్(18) అనే ఇద్దరు విద్యార్థులను అన్యాయంగా బలిగొన్నారు పాస్టర్లు. క్రైస్తవంలోకి మారితే చదువు, ఉద్యోగాలు వస్తాయని మభ్యపెట్టి వారిని బాప్టిజం కోసం కృష్ణానదికి తీసుకురాగా ఈ ఘోరం జరిగింది. బాపట్ల జిల్లా పెనుమూడిలో జరిగిన ఈ ఘటనను పరిశీలిస్తే రేపల్లె సీఐ మల్లికార్జునరావు తెలిపిన వివరాల మేరకు భట్టిప్రోలు మండలం వేమవరానికి చెందిన 30 మంది మతమార్పిడి కోసం పెనుమూడిలో కృష్ణానది వద్దకు వచ్చారు. నదిలో దిగి బాప్టిజం తీసుకుంటుండగా నీటి ఉధృతికి ఐదుగురు కొట్టుకుపోగా వీరిద్దరి ప్రాణాలు పోయాయి. ఈ విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం, అనుమతి లేకుండానే బాప్టిజం ఇప్పించేందుకు పాస్టర్లు తీసుకెళ్ళారు.
 
చివరిగా కేరళలోని ఒక ఘటన మరింత ఆసక్తికరం... తనకు మానవాతీత శక్తులున్నాయని, తన ప్రార్ధనలతో భక్తుల రోగాలు తగ్గిస్తానని చెప్పుకునే ఒక క్రైస్తవ మతాధికారి వైరల్ ఫీవర్ కారణంగా కేరళలోని అలపుళలో హాస్పిటల్ పాలైన ఘటన ఇది. ఫాదర్ వి.పి. జోసెఫ్ వలియవీట్టిల్ అనే ఒక క్రైస్తవ ఫాదరీ కేరళలోని అలపుళలో “కృపాసనం మారియన్ రిట్రీట్ సెంటర్” పేరుతో ఒక స్వస్థత కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈయనకు మానవాతీత శక్తులున్నాయని, తన ప్రార్ధనలతో భక్తుల రోగాలను నయం చేస్తాడని నమ్మే భక్తులకు అక్కడ కొదవ లేదు. కేరళలోని అనేక ప్రాంతాల నుంచి అసంఖ్యాకంగా భక్తులు వచ్చి ఆయన చేసే ప్రార్ధనలతో తమ రోగాలు నయమౌతాయని నమ్మేవారు. ఈ సంస్థ నడిపే “పత్రిక పేజీలను ఉపయోగించి కూడా రోగాలు నయం చేసుకోవచ్చు” అని ఆ పత్రికలో ఇచ్చిన ఒక ప్రకటనపై కోర్టులో వివాదం కూడా నడిచింది. దాంతో సదరు ఫాదరు గారు భక్తులు రోగాలు నయం చేసుకోవడానికి పత్రిక పేజీల తాలూకు బూడిదను వాడడానికి బదులుగా రోగ విముక్తికై తమ కేంద్రానికే రావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
 
ఈ ఘటనల గురించి తెలుసుకున్న తర్వాతయినా ఇదంతా ఒక వ్యవస్థీకృత నేరంగా నడుస్తోందని ఒప్పుకోక తప్పదు. ఇందులో స్వస్థత పేరిట జరిగే తతంగాలను గురించి ప్రధానంగా ప్రస్తావించాం... ఇక పాస్టర్ల లైంగిక దాడులు, వేధింపుల పర్వాన్ని తిరగేస్తే అదంతా అంతులేని ధారావాహికగా కొనసాగుతుంది.