సంగమ రాజవంశానికి చెందిన దేవరాయ I పాలనా కాలం నాటి 15వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించిన రాగి పలకల సమితిని ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ASIతో కలిసి ఫాల్కన్ కాయిన్స్ గ్యాలరీ ఆవిష్కరించింది.
విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఈ రాగి పలకలు సంస్కృతం, కన్నడ, నాగర అక్షరాలలో వ్రాయబడ్డాయి, ఇవి రాజు దేవరాయ I పట్టాభిషేకం సమయంలో జారీ చేసినవని, ముఖ్యంగా, వీటి ముద్రలో విజయనగర సామ్రాజ్యం యొక్క రాజ చిహ్నమైన వరాహంకు బదులుగా వామనుని చిత్రం ఉందని తెలిపారు.
రాగి పలకలు శక 1328 (నాగ-చక్షు-గుణ శశి), వ్యాయ, కార్తీక బా. దాసమి (10), శుక్రవారం, నవంబర్ 5, 1406 CEకి సంబంధించినది, ఇది సంగమ రాజవంశం యొక్క వివరణాత్మక వంశావళిని తెలుపుతుంది. ఫాల్కన్ కాయిన్స్ గ్యాలరీ స్వాధీనం చేసుకున్న నాణేల సేకరణ ద్వారా రాగి పలకలు బయటపడ్డాయి. ఫాల్కన్ కాయిన్స్ గ్యాలరీ మేనేజింగ్ డైరెక్టర్ కీర్తి ఎం. పరేఖ్ ఇలా వివరించారు, “ఒక వ్యక్తి మమ్మల్ని సంప్రదించి, ఆ పలకలు తన తాతకు చెందినవని చెప్పి, వాటిని అమ్మడానికి ముందుకొచ్చాడు. ఈ రాగి పలక విజయనగర సామ్రాజ్యం మరియు దాని చరిత్రను తెలుపుతోందని కాబట్టి ఇది ముఖ్యమైనది.” భావించామని తెలిపారు.
ఫాల్కన్ కాయిన్స్ గ్యాలరీ మేనేజర్ హార్దిక్ పరేఖ్ మాట్లాడుతూ, ఈ పలకలను కనుగొన్న వెంటనే వారు ASIకి సమాచారం అందించారని, వారు అధ్యయనం కోసం ముద్రలు తీసుకున్నారని తెలిపారు. మైత్రక రాజవంశం (గుజరాత్లోని జునాగఢ్లో కనుగొనబడింది) మరియు గంగా రాజవంశం (కర్ణాటకలోని తలకాడులో కనుగొనబడింది) నుండి వచ్చిన మరో రెండు వాటితో పాటు, ఇది కొనుగొనబడిన మొట్టమొదటి పట్టాభిషేక రాగి పలక అని ఆయన పేర్కొన్నారు.
“పురాతన శాసనాలు మరియు ముద్రలను రక్షించడానికి మరియు సంరక్షించడానికి ASI ప్రజలలో అవగాహన పెంచుతోందని KM రెడ్డి తెలిపారు. సరైన డాక్యుమెంటేషన్ మరియు పరిరక్షణ కోసం ఏదైనా విలువైన చారిత్రక కళాఖండాలను ASIకి నివేదించాలని ఆయన ప్రజలను కోరారు.