అయోధ్య బాలరాముని సింహాసనం ఇక భక్తుల దర్శనార్థం

VSK Telangana    09-May-2025
Total Views |
 
Ayodhya
 
 

అయోధ్య రామమందిర సముదాయంలో 1949 నుండి రామ్ లల్లా చాలా సంవత్సరాలు కూర్చున్న సింహాసనాన్ని భక్తులు చూడటానికిప్రదర్శనకు ఉంచనున్నారు. దీనితో పాటు, రామ్‌లాలా దశాబ్దాలుగా నివసించిన గుడారానికి కూడా ఆలయంలో జ్ఞాపిక స్థానం కల్పించనున్నారు. ఈ రెండు వస్తువులు ఆలయ ట్రస్ట్ వద్ద సురక్షితంగా ఉన్నాయి.

మరోవైపు అయోధ్య రామమందిర శిఖరంపై 2 లైట్లు ఏర్పాటు చేయనున్నామని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. రెండు లైట్లలో ఒకటి ఏవియేషన్ సిగ్నల్ అని ఇది ఆలయం మీదుగా ఎగురుతున్న విమానాలకు రెడ్ లైట్ సిగ్నల్ ఇస్తుంది. మరొకటి మెరుపు అలెర్ట్ ఇది పిడుగుపాటు సమయంలో ఆలయాన్ని కాపాడుతుందని కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు.

అయోధ్య ఆలయ నిర్మాణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ ప్రాకార నిర్మాణం పెద్ద సవాలు అని అన్నారు. ఆలయం వెనుక పశ్చిమ వైపున పరకోట మరియు ఆలయం మధ్య ఒక వంతెన నిర్మిస్తున్నారని అందులో లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.రామమందిర పైభాగంలో మూడు నుండి నాలుగు నెలల్లో జెండాను ఏర్పాటు చేయనున్నామని దీనిని ట్రస్ట్ ఏర్పాటు చేస్తుందని తెలిపారు