మహరాష్ట్ర పూణే జిల్లాలోని పౌడ్ గ్రామంలోని నాగేశ్వర్ మహాదేవ్ ఆలయంలో 16 ఏళ్ల చాంద్ షేక్ అసహ్యకరమైన చర్యకు పాల్పడ్డాడు. శివలింగాన్ని అపవిత్రం చేయడంతో పాటు, అన్నపూర్ణ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు.
అందిన సమాచారం ప్రకారం, గ్రామ దేవత విగ్రహాన్ని అపవిత్రం చేసిన తండ్రీకొడుకులపై పౌడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితులైన చాంద్ షేక్ (16), నౌషాద్ షేక్ (45) గా గుర్తించి అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీలో ఆ యువకుడు అన్నపూర్ణ దేవత విగ్రహాన్ని అపవిత్రం చేస్తున్నట్లు కనిపించింది. “ఈ విషయంపై, శివాజీ వాఘ్వాలే (పౌడ్ నివాసి) పౌడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిందితుడు చంద్ నౌషాద్ షేక్ నాగేశ్వర్ ఆలయానికి వచ్చి, దేవత విగ్రహాన్ని కూల్చివేసి, దానిని అపవిత్రం చేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందని ఆయన చెప్పారు. స్థానికులు అతని తండ్రితో మాట్లాడటానికి అతని ఇంటికి వెళ్లారు. అయితే, బాలుడి తండ్రి బెదిరింపులకు దిగి వారిని దుర్భాషలాడాడు” అని పోలీసులు తెలిపారు.
గ్రామస్థులు నాగేశ్వర్ ఆలయంలో అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని ముస్లిం యువకుడు అపవిత్రం చేసిన సంఘటనను ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో వారు “జై శ్రీరామ్” మరియు “పాకిస్తాన్ ముర్దాబాద్” నినాదాలు చేశారు.