హైద్రాబాద్ చంపాపేట్ వేద జూనియర్, డిగ్రీ కాలేజీలో పాతబస్తీకి చెందిన చదువుతున్న మాదిహా షాజీన్ అనే విద్యార్థి సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆ యువతి పాకిస్తాన్, భారత్ యుద్ధం జరిగే సమయంలో తన X ఖాతాలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పోస్ట్ చేసింది. చేసిందంతా చేసి, అమాయకులను బద్నాం చేస్తున్నానంటూ పేర్కొంది. అంతేకాకుండా చూసి సిగ్గుపడుతున్నాననంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా పహల్గాం దాడి చేయించింది భారత్ అని, ఇప్పుడు యుద్ధం పేరుతో పాక్లోని అమాయకులను భారత సైన్యం హతమారుస్తోందని, తన తోబుట్టువులైన పాక్ ప్రజలను అల్లా కాపాడతాడని యువతి పోస్టులు పెట్టింది.
ఈ విషయం తెలుసుకున్న బీజేపీ, విహెచ్ పి నాయకులు కాలేజీ ముందు ధర్నా చేపట్టి ఆ యువతి పై కేసు నమోదు చేయించారు. అనంతరం కాలేజి నుంచి సస్పెండ్ చేయాలని ధర్నా చేపట్టారు.దీంతో ప్రిన్సిపాల్ ఆ యువతిని కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు.