అయోధ్యలో వివిధ రకాల దేవతా వృక్షాలతో పంచవటి రూపకల్పన

VSK Telangana    24-Jul-2025
Total Views |
 
ayodhya
 
అయోధ్య ఆధ్యాత్మిక , సాంస్కృతిక వైభవాన్ని మరింతగా ఇనుమడింపచేయడానికి త్రేతాయుగం నుండి ప్రేరణ పొంది 20 ఎకరాల విశాలమైన చెట్లతో కూడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాంతానకి పంచవటిగా నామకరణం చేశారు.. పవిత్ర రామాయణంలో చెప్పబడినట్లుగా, శ్రీరాముడు అరణ్యవాస సమయంతో ముడిపడి ఉన్న చెట్లను పెంచుతూ పర్యావరణ ధ్యాన వాతావరణంలోకి భక్తులను తీసుకెళ్లడమే ఈ పంచవటి లక్ష్యం.
 
పంచవటి కేవలం ప్రకృతి దృశ్యాలతో అలంకరించబడిన తోట కాదు, ప్రాచీన భారతదేశానికి సంబంధించిన పర్యావరణ వాస్తవికతను ప్రతిబింబించేలా రూపొందించబడిన జాగ్రత్తగా నిర్వహించబడిన సహజ స్థలం. నాటబోయే వృక్షజాలంలో రావి, మర్రి, రేగు, ఉసిరి, మామిడి, శమీ, సీతా అశోక, కదంబ, పలాస, పారిజాత్ ,చంపా మొదలైనవి ఉన్నాయి. ఈ మొక్కలు ఆధ్యాత్మికంగా గౌరవించబడటమే కాకుండా ఔషధ ,పర్యావరణ ప్రాముఖ్యతను కూడా కలిగి ఉన్నాయి.
 
ముఖ్యంగా, రామాయణంతో ముడిపడి ఉన్న పవిత్రమైన సీతా అశోక వృక్షాన్ని శ్రీలంక నుండి దిగుమతి చేసుకోనున్నారు. ఆ యుగం యొక్క జీవవైవిధ్యాన్ని ఖచ్చితంగా సూచించడానికి అవసరమైన చోట ఇతర వృక్ష జాతులను అంతర్జాతీయంగా సేకరించడం జరుగుతుంది
 
రామాయణంలోని సంఘటనలు జరిగిన త్రేతా యుగంలోని ప్రశాంతమైన , పవిత్రమైన పరిసరాలను పునఃసృష్టించడంతో పాటుగా పురాతన గ్రంథాలలో ప్రస్తావించబడిన 88 రకాల అరుదైన, ఔషధ ,ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన వృక్షజాలాన్ని నాటడం ద్వారా దీనిని రూపొందించడం దీని లక్ష్యం.
భగవాన్ రాముడు వనవాసంలో ఉన్న సమయంలో చిత్రీకరించబడిన జీవనశైలికి అనుగుణంగా, ధ్యానం, పారాయణం తో పాటుగా ఒక విహారయాత్రగా పనిచేసేలా ఈ ప్రాంతాన్ని రూపొందిస్తున్నారు. భక్తులు భౌతిక ప్రపంచం నుండి దూరంగా మన:శాంతిని పొందగల , ప్రకృతి తో తాదాత్య్మం చెందేలా ఈ స్తాలన్ని రూపొందిస్తున్నారు. అందుకోసం వాల్మీకి రామాయణం, గోస్వామి తులసిదాస్ రామచరితమానస్ వంటి ప్రధాన గ్రంథాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఈ పంచవటిని అభివృద్ధి చేసే బాధ్యతను ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ అయిన GMR గ్రూప్‌కు అప్పగించారు. రామ జన్మభూమి ప్రాంగణంలోని దక్షిణ పార్శ్వంలో కుబేర్ తిలా సమీపంలో ఉన్న మొదటి 10 ఎకరాల్లో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్ట్ ముందుకు సాగుతున్న కొద్దీ మిగిలిన 10 ఎకరాలను క్లియర్ చేసి దశలవారీగా అప్పగిస్తున్నారు. ఇప్పటికే భూమి తయారీ, నేల పరీక్ష , చిన్న చిన్న మొక్కలను నాటడం లాంటి ప్రారంభ నాటడం ప్రక్రియ జరుగుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. స్థలం
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ పంచవటిని అయోధ్య సాంస్కృతి, ఆధ్యాత్మిక పునరుజ్జీవనంలో ఒక మైలురాయిగా భావిస్తుంది. రామాయణంలోని రాముడి వనవాస సహజ నైతికతను పునరుద్ధరించడం అనేది పంచవటి పూర్తి చేస్తుంది.