అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. భారత్ ప్రభుత్వం మాకు ఎంతో సహకరించింది. ఎంబసీ ముందుగానే సమాచారమిచ్చి, వీలైనంత త్వరగా దేశం విడిచిపెట్టేలా సహాయం చేసింది. ‘మోదీజీ ఉన్నారు అంటే అన్నీ సాధ్యమే" అంటూ ఓ ప్రయాణికుడు భావోద్వేగంగా చెప్పారు.
మరో భారతీయుడు మాట్లాడుతూ, "మేం నెల రోజులుగా ఇరాన్లో ఉన్నాం. కానీ గత వారం, పది రోజుల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బయటకు వెళ్తే ఆందోళనకారులు కార్లను అడ్డుకునేవారు. కొంత ఇబ్బంది కలిగించేవారు. ఇంటర్నెట్ పూర్తిగా నిలిపివేయడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేక చాలా ఆందోళన చెందాం. ఎంబసీతో కూడా సంప్రదించలేకపోయాం" అని తెలిపారు.
ఇదిలా ఉండగా ఇరాన్ నుంచి తిరిగొస్తున్న వారి కోసం అనేక కుటుంబాలు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. తమ బంధువులు సురక్షితంగా తిరిగొస్తుండటంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.